దేవాలయ చరిత్ర - అభివృద్ది

***నల్లగొండ జిల్లా , మునగాల మండలంలోని బరాఖత్ గూడెం గ్రామం లో శ్రీ శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి వారు 100 సంవత్సరములకు పూర్వమే ఒక పెద్ద రావిచెట్టు క్రింద ప్రతిష్టించబడి గ్రామప్రజలచే పూజలందుకొనుచుండిరి.

*** శ్రీ శ్రీ శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవాలయం 30 సంవత్సరముల క్రితము గ్రామ ప్రజల సహాయ, సహకారములతో నిర్మాణము గావించిరి.


*** ఈ స్వామి వార్లకు ఇటీవల కాలము వరకు నిత్య నైవేద్యం వంటి నిర్వహణ లేదు, కానీ భక్తుల ఆదరణ బాగుగా నుండుటచే దేవాలయములను పునర్నిర్మాణము గావించుటకు గ్రామస్తులు సంకల్పించిరి.


2007, మార్చి 15 వ తేదీన
గ్రామప్రజలు , పరిసర ప్రాంత మరియు ఇతర ప్రాంతాల భక్తుల విరాళాలతో పునర్నిర్మాణము గావించిన దేవాలయములలో స్వామి వార్ల ప్రాణప్రతిష్ట జరిగినది.



మరియు అదే సమయములో నూతనముగా శ్రీ శ్రీ శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి వారి దేవాలయమును కూడా నిర్మించిరి.


* ఇంకను ప్రహరీ గోడ నిర్మాణము, శివాలయ గోపురము, మంచినీటి వసతి మరియు ఇతర పనులు డబ్బులు లేక ఆగి పోయి ఉన్నవి.



*** గత మూడు సంవత్సరాలుగా స్వామివార్లకు నిత్య ధూప , దీప నైవేద్యాల కొరకు భక్తులు సహాయ, సహకారములను అందించుచూ స్వామివారి కృపకు ప్రాప్తులగు చున్నారు.

* స్వామి వార్లకు ఎటువంటి స్తిర, చర ఆస్తులు లేనందున మీకు తోచిన విరాళములను అందించి, నిత్యధూప,దీప నైవేద్యము జరుపుటలో పాలు పంచు కొని, స్వామి వారి ఆశిస్సులు పొందగలరని మనవి .


* విరాళములు ఇచ్చిన భక్తుల గోత్ర ,నామములు శిలా ఫలకము పైన రాసి, వారు కోరుకున్న రోజున ప్రత్యేక పూజ జరిపించబడును.


విరాళములు సమర్పించు వివరాలకు సంప్రదించండి:
గోళ్లమూడి అప్పారావు గారు,
శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవాలయ కమిటి చైర్మన్,
బరాకత్ గూడెం(గ్రా):నల్లగొండ (జి) ఆంధ్ర ప్రదేశ్, ఇండియా.
సెల్ నెంబర్ : (+91) 94410 10166.
e-mail: barakhatgudem@gmail.com
Contact details in USA :
Srinivas Gollamudi - (302) 294 - 2454.






ధ్వజ స్తంభ ఊరేగింపు
















శ్రీ వెంకటేశ్వరస్వామివారి వద్దనుండి ఊరేగింపుగా పయనం














పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము, బరకత్ గూడెం.























































బరాఖత్ గూడెంలో వేంచేసి యున్నసీతారామచంద్ర స్వామి వారు .........


బరాఖత్ గూడెంలో కొలువుదీరి వున్న సీతా రామ చంద్ర స్వామివారు


పూజా కార్యక్రమాలు చేస్తున్న భక్తులు
వేద పండితులచే ప్రతిష్టా శుద్ధి వచనాలు




ప్రతిష్టా మూర్తులకు పూజా కార్యక్రమాలు...........


వేద పండితులచే ప్రతిష్టా మూర్తులకు శుద్ధి అభిషేక మహోత్సవాలు



ప్రతిష్ట కొరకు దేవతా మూర్తుల పయనం








ఆంజనేయ స్వామి ధ్వజ స్తంభ ప్రతిష్టా మహోత్శావాలు.............

పురాతన ధ్వజ స్తంభాన్ని భక్తితో అలంకరిస్తున్న మహిళా భక్తులు
వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ధ్వజ స్తంభమును నిలబెడుతున్న భక్తులు




రామాలయ ధ్వజ స్థంభ ప్రతిష్ట...............




దేవాలయము నందు ధ్వజ స్తంభ ప్రతిష్టా మహోత్సవము



ఉత్సవములో పాల్గొన్న అశేష జనవాహిని




భక్త జన సందోహం